AP BRS : ఏపీలో పర్యటించనున్న బిఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్

AP BRS  ఆంధ్రప్రదేశ్‌లో బిఆర్‌ఎస్ విస్తరణపై   ఆ పార్టీ  నాయకత్వం దృష్టి పెట్టింది. ఏపీ బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌ బుధవారం గుంటూరులో పర్యటించనున్నారు. బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలతో కలిసి గుంటూరు జిల్లాలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.  తాడేపల్లి మండలం, ఉండవల్లి గ్రామంలో నిర్వహించే  మహా మృత్యుంజయ జప (దోష) విశ్వశాంతి మహాయాగానికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారు. 

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/zTquRve
via IFTTT

Post a Comment

Previous Post Next Post